రవీంద్రభారతి, జూలై 30 : సాహిత్యం, కవిత్వం రెండూ సమాజ మార్పునకు దోహద పడుతాయని.. తెలంగాణ రాష్ట్రం కూడా సాహిత్యం, పాటలు, పద్యాలతోనే ఏర్పడిందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ అన్నారు. తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ అక్షరయాన్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జన్మదినం సందర్భంగా విశ్వదర్పణ్ హిందీ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ, తెలుగులో ప్రాచుర్యం పొందిన విశ్వదర్పణం ప్రయోగ పద్యాలను హిందీలోకి దర్పణ్గా అనువదించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సాహిత్య సమావేశాలు రవీంద్రభారతిలో నిత్యం జరపాలని కవులు, కళాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, నేటి నిజం సంపాదకులు దేవదాసు, తంగేడు పుస్తక సంపాదకులు కాంచనపల్లి ఘోరా, అనువాద రచయిత డాక్టర్ మరింగంటి లక్ష్మణాచార్యులు, అక్షరయాన్ అధ్యక్షురాలు అయినంపుడి శ్రీలక్ష్మీ, రమాదేవికులకర్ణి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు పాల్గొన్నారు.