బడంగ్పేట్, మార్చి18: బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో శానిటేషన్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాలకు సంబంధించిన దస్ర్తాలను పరిశీలించినట్లు తెలిపారు.
జీహెచ్ఎంసీకి సంబంధించిన 15 మంది విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో జరిగిన అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తికాగానే జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్కు నివేదిక అందజేస్తామన్నారు. మూడు నాలుగు రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందన్నారు.