ఎల్బీనగర్, ఏప్రిల్ 1 : సరూర్నగర్, ఎల్బీనగర్, హయత్నగర్ సర్కిళ్లలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అయితే అధికారులు మూడు కార్యాలయాలకు వచ్చిన సమయంలో అన్ని విభాగాల్లో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో విజిలెన్స్ అధికారులు అవాక్కయ్యారు.
కీలక రికార్డులు స్వాధీనం..
చాంద్రాయణగుట్ట: పాతబస్తీ బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో స్టేట్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేశారు. పలు కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పలు రిజిస్టర్లతో పాటు అటెండెన్స్ రికార్డులు పరిశీలించారు.