తెలుగుయూనివర్సిటీ, నవంబర్ 1 : ప్రతిభ కలిగిన కళాకారులకు పురస్కారాలు ప్రోత్సాహకాన్ని అందిస్తాయని తెలంగాణ ప్రభుత్వ న్యూఢిల్లీ సలహాదారు డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. కళానిలయం సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దసరా-దీపావళి పండుగలను పురస్కరించుకుని తెలంగాణ సారస్వత పరిషత్లో ప్రతిభతో నటన రంగంలో రాణిస్తున్న పలువురు యువ నటీనటులకు యూత్ ఐకాన్ అవార్డులు, ప్రతిభామూర్తులకు విజయ దీపావళి విశిష్ట పురస్కారాలు, చిన్నారులకు చాచా నెహ్రూ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముందుగా డాక్టర్ శోభానాయుడు స్మరణలో శోభాయమానం శీర్షికన పలువురు యువనర్తకీమణులు నిర్వహించిన నృత్య విభావరి శోభానాయుడుకు అంకితం చేశారు. నృ త్య గురువు డాక్టర్ భారతి అధ్యక్షత వహించా రు. వేణుగోపాలచారి, మల్కాజగిరి కోర్టు జడ్జి మధుసూదన్, సాహితీవేత్తలు వసంతరాయలు తదితరులు పాల్గొని పురస్కారాలు అందజేసి సేవలను కొనియాడారు. కళానిలయం సంస్థ వ్యవస్థాపకులు పుష్పలత, కార్యదర్శి సురేందర్ పాల్గొన్నారు.