హైదరాబాద్ : గణేశ్ నిమజ్జన ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో ట్యాంక్బండ్పై వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ట్యాంక్బండ్పై రెండు వైపులా రాకపోకలను పునరుద్ధరించినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ మార్గ్ నుంచి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు వాహనాలను అనుమతిస్తున్నట్లు తెలిపారు.
ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఖైరతాబాద్ వైపు కూడా రాకపోకలను పునరుద్ధరించారు. పీవీ మార్గ్లో మాత్రమే విగ్రహాల నిమజ్జనానికి అనుమతించినట్లు సీపీ చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంట లోగా పీవీ మార్గ్ పునరుద్ధరిస్తామని, మిగిలిన అన్ని మార్గాల్లో యథావిధిగా రాకపోకలు కొనసాగుతాయని సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.