నేరేడ్మెట్, ఫిబ్రవరి 14 : వసంత పంచమిని పురస్కరించుకొని.. సైనిక్పురి శృంగేరి శంకరమఠంలో కొలువైన శ్రీ శారదాంబ అమ్మవారిని శ్రీవీణా శారదగా అలంకరించారు. ఈ సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు చేశారు.