హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇవాళ ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్(Emergency Landing) చేశారు. బెంగుళూరు నుంచి వారణాసి(Varanai) వెళ్తున్న ఆ విమానాన్ని దారి మళ్లించి అత్యవసరంగా హైదరాబాద్లో దించారు. 6E897 విమానంలో సాంకేతిక సమస్య(technical problem) వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ముందుజాగ్రత్తగా ఆ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి డైవర్ట్ చేసినట్లు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.
ఉదయం 6.45 నిమిషాలకు విమానాన్ని అత్యవసరంగా దించారు. ఆ విమానంలో 137 మంది ప్యాసింజెర్లు ఉన్నారని, వాళ్లంతా క్షేమంగా ఉన్నట్లు డీజీసీఏ(DGCA) తెలిపింది. ఈ ఘటన పట్ల దర్యాప్తునకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. అయితే వారణాసి వెళ్లే ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇండిగో విమానం(Indigo flight)లో సాంకేతిక సమస్య ఉత్పన్నం అయినట్లు పైలెట్ గుర్తించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ విమానానికి అవసరమైన ఇన్స్పెక్షన్ చేస్తున్నట్లు తెలిపారు.