కందుకూరు, మే 23 : ఒకప్పుడు ఇంట్లో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు చేసిన చోట, నీటి సదుపాయం లేక అంత్యక్రియలకు హాజరైన వారు ఇబ్బందులు పడేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనిషి ఆఖరి మజిలీని ఆత్మీయంగా నిర్వహించుకునేందుకు ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ. 11లక్షల 50 వేలను మంజూరు చేసి అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మించింది. అదే విధంగా సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి గ్రామాల్లోని సమస్యలను తెలుసుకొని వాటిని దశల వారీగా పరిష్కరిస్తున్నారు.
ముఖ్యంగా డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలను ఏర్పాటు చేస్తున్నారు. జీవించినంత కాలం గౌరవంగా బతికిన మనిషి చివరి మజీలిని ప్రశాంతంగా గౌరవప్రదంగా నిర్వహించేందుకు వైకుంఠధామాలను ఏర్పాటు చేసింది. ఇలా మనిషి చివరి అంత్యక్రియలు చేసుకోవడానికి సైతం గ్రామాల్లో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని హైదరాబాదులో మహాప్రస్థానం ఉన్నట్టు అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలను నిర్మించారు. మండలంలోని 35గ్రామ పంచాయతీల్లో దాదాపు 40కోట్ల రూపాయలతో శ్మశాన వాటికల నిర్మాణం పూర్తి చేశారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పల్లె ప్రగతి వల్ల గ్రామాల్లో శ్మశాన వాటికలు నిర్మితమయ్యాయి. ప్రతి పంచాయతీకి ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన రూ. 11లక్షల 50వేలతో స్నానపు గదులు, విశ్రాంతి గదులు ముఖద్వారం వంటి నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో ఆఖరి మజిలీకి ఇబ్బందులు త ప్పాయి. దహన సంస్కారాలు చేసుకోవచ్చు.
– మంద జ్యోతిపాండు, ఎంపీపీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో సమస్యలు పరిష్కారమవుతున్నాయి. గత ప్రభుత్వాలు గ్రా మాలను పట్టించుకోలేదు. దీం తో ఎక్కడవేసిన సమస్యలు అ క్కడే ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తుంది. పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాలకు వరంలాంటిది.
-పరంజ్యోతి,సర్పంచ్ లేమూరు
ఒకప్పుడు అభివృద్ధికి దూర ంగా గ్రామాలు ఉండేవి. కానీ తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. గ్రామస్తులు, అధికారులు, వా ర్డు మెంబర్ల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళుతున్నా. శ్మశాన వాటికలతో పాటు పల్లె ప్రగతిలో భాగంగా డంపింగ్ యార్డు, వననర్సరీ, పల్లె ప్రకృతి వనం పనులు పూర్తయ్యాయి. శ్మశాన వాటికలు పూర్తయ్యాయి.
-సాధ మల్లారెడ్డి ,సర్పంచ్ కొత్తగూడ