ఉప్పల్/మల్లాపూర్/చర్లపల్లి, జనవరి 3 : కరోనా వైరస్ వ్యాప్తి నివారణ లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మల్లాపూర్ డివిజన్ సూర్యానగర్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కుషాయిగూడ జమ్మిగడ్డ ఆరోగ్య కేంద్రం, పెద్ద చర్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 నుంచి 18 సంవత్సరా ల లోపువారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిం చాలన్నారు. వైరస్ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. కరోనా, ఒమ్రికాన్ వైరస్ల వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెంద వద్దని, జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆరోగ్య సంరక్షణకు వ్యాక్సిన్ తప్పనిసరి అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని సిబ్బందికి సూచించారు.
ఆయా కార్యక్రమాల్లో వైద్యులు పూజ, సంపత్, స్వప్నారెడ్డి, కౌశిక్, కార్పొరేటర్లు బన్నాల గీతాప్రవీణ్ ము దిరాజ్ , పన్నాల దేవేందర్రెడ్డి, ప్రభుదాస్, సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డి, బొంతు శ్రీదేవి , పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ సౌందర్యలత, స్వప్నిక, నాయకులు సంతోశ్రెడ్డి, బద్దం భాస్కర్రెడ్డి, సుధాకర్, నర్సింగ్రావు, మస్క సుధాకర్, వెంకట్రావు, వెంకటేశ్, ఐలేశ్, స్వీట్హౌజ్ రాజు, కిరణ్కుమార్రెడ్డి, శ్రీనివాస్, తండా వాసుగౌడ్, కుంటి క్రిష్ణ, మారుతీరావు, పద్మారెడ్డి, ప్రభాకర్రెడ్డి, గరికె సుధాకర్, ప్రతాప్రెడ్డి, సానల రవి, శ్రీకాంత్, రమేశ్ , కొత్త రామారావు, కాసం మహిపాల్రెడ్డి, కుమార్స్వామి, నాగిళ్ల బాల్రెడ్డి, నారెడ్డి రాజేశ్వర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, కొమ్ము రమేశ్, పాల్గొన్నారు.