మారేడ్పల్లి, నవంబర్ 1: ప్రతిజీవి మనుగడకు మంచినీరు ఎంతో ఉపయోగపడుతుందని, నీటి ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరు అవగాహన కల్గి ఉండాలని తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్రావు అన్నారు. మారేడ్పల్లి కస్తూర్భా మహిళ డిగ్రి, పీజీ కళాశాల ఎన్సీసీ కెప్టెన్ జయసుధ ఆధ్వర్యంలో గంగా ఉత్సవ్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. చైర్మన్ వి.ప్రకాశ్ రావు మాట్లాడుతూ, స్వాతంత్య్రం రాక ముందు నదులన్నీ స్వచ్ఛంగా, నిర్మలంగా ఉండేవని, స్వాతంత్య్రం అనంతరం, నదులన్నీ కలుషితం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు నీటి ఆవశ్యకతను తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ రాజశ్రీ, తదితరులు పాల్గొన్నారు.