కవాడిగూడ, డిసెంబర్ 24 : ఆర్య వైశ్యుల సంక్షేమానికి నూతన సీఎం రేవంత్ రెడ్డిని త్వరలో కలిసి ప్రత్యేక ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు. ఈ మేరకు ఆదివారం ముషీరాబాద్ వాసవీ హాస్టల్ భవనంలో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వైశ్యులందరినీ ఒక ప్లాట్ఫాం మీదకు తీసుకువచ్చేందుకు ఫెడరేషన్ కృషి చే స్తుందని అన్నారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పేద వైశ్యులను ఆదుకోవడానికి ఫెడరేషన్ ముం దుంటుందని పేర్కొన్నారు. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం, సేవాపరంగా అన్ని పార్టీలు వైశ్యులకు సముచిత స్థానం కల్పించడానికి కృషి చేస్తామని అన్నారు. పేద వైశ్య విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఫెడరేషన్ తరపున వసతి, స్కాలర్షిప్లు ఇతర సౌకర్యాలను సైతం కల్పిస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు రాష్ట్ర, కేంద్ర కమిటీ సభ్యులు రమేశ్, మహేశ్, చంద్రశేఖర్, సత్తయ్య, ఉప్పల స్వప్న, వైశ్యఫెడరేషన్ యువజన సంఘం అధ్యక్షుడు రవి పాల్గొన్నారు.