కాప్రా, జూలై 11: ‘ఉప్పల్’ను సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ‘మీకోసం మీ ఎమ్మెల్యే పాదయాత్ర’లో భాగంగా మంగళవారం కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన.. డివిజన్ పరిధిలోని సాయిబాబానగర్, సాయిరాంనగర్, న్యూ ఇందిరానగర్ బస్తీల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ఏయే సమస్యలున్నాయని అడిగి తెలుసుకున్నారు.
పారిశుధ్య నిర్వహణను మెరుగు పర్చాలని, డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలని, మ్యాన్హోల్స్ ఏర్పాటు చేయాలని, పాతవాటి మ్యాన్హోల్స్ స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయాలని, సీసీ రోడ్లు వేయించాలని, అవసరమున్న చోట తాగునీటి సరఫరా లైన్లు వేయాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉండకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుం టూ సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే ల క్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు. అనంతరం సాయిబాబానగర్ వాటర్ ట్యాంక్ ఆవరణలో అధికారులతో సమీ క్షా సమావేశం నిర్వహించి, పాదయాత్రలో స్థానికులు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
ఈ పాదయాత్రలో హెచ్బీకాలనీ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు ధన్పాల్రెడ్డి, జి.శ్రీనివాస్రెడ్డి, ఉప్పల్ బీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు బద్రుద్దీన్, కాప్రా డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సుడుగు మహేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గిల్బర్ట్, నాయకులు వెంకటేశ్వర్రెడ్డి, గరిక సుధాకర్, రఘుపతిరెడ్డి, కాటేపల్లి రవీం దర్రెడ్డి, బేతాల బాలరాజు, కాసం మహిపాల్రెడ్డి, కొండల్గౌడ్, పవన్, బంక వెంకటేశ్, మచ్చపాండు, వస్ర్తాల వెంకటేశ్, సోమ్నాథ్, శ్రీకాంత్గౌడ్, శివకుమార్, కిట్టు, ప్రభాకర్రెడ్డి, శైలేశ్రెడ్డి, భిక్షపతి, చందు, అలీ, గౌస్, శంకర్కుమార్, హేమంత్, సుశీల్, బంటి సంతు, మహిళా నాయకురాళ్లు దేవి, మల్కరమాదేవి, తదితరులు పాల్గొన్నారు.