ఉప్పల్, జూన్ 3 : ఉప్పల్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను గురువారం మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిజన బస్తీ ఇందిరానగర్లో రూ.22.50 లక్షలతో ఎస్సీ మహిళా భవనం, ఓల్డ్ విలేజ్లో రూ.42 లక్షలతో షాదీఖాన భవనం, కిష్టారెడ్డికాలనీలో రూ.55 లక్షలతో ఆర్సీసీ బాక్స్ కల్వర్టు నిర్మాణం, లక్ష్మీనారాయణకాలనీలో రూ.26.50 లక్షలతో భూగర్భ డ్రైనేజీ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మందుముళ్ల రజితాపరమేశ్వర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్రెడ్డి, వాటర్వర్క్స్ జీఎం జాన్షరీఫ్, ఈఈ నాగేందర్, డీఈ నిఖిల్రెడ్డి, ఏఈ వసంత, డీజీఎం శ్రీధర్రెడ్డి, ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి, నేతలు గడ్డం రవికుమార్, చింతల నర్సింహారెడ్డి, గరిక సుధాకర్, గోపాల్రెడ్డి, సుధాకర్, వేముల వెంకట్రెడ్డి, సత్యపాల్రెడ్డి, స్వీట్హౌజ్ రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్: ఉప్పల్ సర్కిల్ పరిధిలోని కరోనా టీకా కేంద్రాలను ఎంపీ రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి గురువారం పరిశీలించారు. ఈమేరకు సూపర్ స్ప్రెడర్స్కు వేస్తున్న టీకాల పంపిణీ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ రేవంత్రెడ్డి ఉప్పల్ పీహెచ్సీలో కరోనా టీకా రెండో డోసును తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ వైద్యాధికారిణి డా.సౌందర్యలత, సూపర్వైజర్ బోగ ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.
నాచారంలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ గురువారం ప్రారంభించారు. ఈమేరకు పలువురు డ్రైవర్లకు టీకాలు వేశారు. ఉప్పల్ ఆర్టీఓ రవీందర్కుమార్ పర్యవేక్షణలో వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది. కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ పరిశీలించారు. వసతులు, వైద్యసేవలు, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ స్వప్నిక, తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్: సంక్షోభంలోనూ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చిలుకానగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో గురువారం అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న శ్రీనగర్కాలనీలో సీసీ రోడ్డు, యూజీడీ, సాయిరాంనగర్లో దోబీఘాట్లో స్టోర్రూం, ఆదర్శనగర్ జర్నలిస్టుకాలనీలో యూజీడీ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఈఈ నాగేందర్, ఏఈ రాజ్కుమార్, నేతలు గడ్డం రవికుమార్, పల్లె నర్సింగ్రావు, కొండల్రెడ్డి, వీబీ.నర్సింహ, పిట్టల నరేశ్, గరిక సుధాకర్, రాంరెడ్డి, యాదిరెడ్డి, మాస శేఖర్, పండ్ల కిషన్, మహేందర్, జగన్, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నాచారం డివిజన్లోని రాఘవేంద్రనగర్లో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను గురువారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, నాచారం కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ పరిశీలించారు. కార్యక్రమంలో సాయిజెన్ శేఖర్, డీఈ రూప, ఏఈ రాకేశ్, నేతలు సుధాకర్, కట్ట బుచ్చన్న, అంజి, రఫిక్, చింతల నర్సింహారెడ్డి, ఐలేశ్ తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్: రామంతాపూర్లోని గాంధీనగర్ కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను గురువారం ఎంపీ రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ కార్పొరేటర్ రజితాపరమేశ్వర్రెడ్డి, తవిడబోయిన గిరిబాబు, టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్: రామంతాపూర్ చిన్న చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగింపు పనులను గురువారం స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణితో కలిసి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గుర్రపు డెక్కను త్వరితగతిన తొలగించాలని అధికారులను ఆదేశించారు. చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని చెరువులను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్ననాగేశ్వర్రావు, టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, సూరం శంకర్, నందికంటి శివ, బీజేపీ నాయకులు రేవు నర్సింహ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.