ఉప్పల్, మే 27 : ఉప్పల్- నాగోల్లోని మూసీ పరీవాహక ప్రాంతంలో జరుగుతున్న సుందరీకరణ పనులను గురువారం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు పనులు వివరాలు తెలుసుకొని, సూచనలు చేశారు. వాకింగ్ ట్రాక్, ఫొటోషూట్ ప్రదేశాలు, వంద అడుగుల జాతీయ జెండా స్తంభం ఏర్పాటు, మురుగునీటి శుద్ధీకరణ పనులు పరిశీలించారు. అదేవిధంగా ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం పార్కు ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డిని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి కోరారు. ఈ మేరకు సుధీర్రెడ్డి మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మూసీని సుందరీకరించి, ఆహ్లాదకరంగా మారుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి, నేతలు గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, గంధం నాగేశ్వర్రావు, చింతల నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.