రామంతాపూర్, ఏప్రిల్ 9: ఉప్పల్ నియోజక వర్గాన్ని నాలుగున్నర ఏండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆదివారం పద్మశాలి భవన్లో జరిగిన రామంతాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పనులు పూర్తి చేసే బాత్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, కానీ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు చేయడం ఏమిటని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మినీ శిల్పారామం, స్కైవే, అన్ని కులాల ఆత్మగౌరవ భవనాలు, తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. 8 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి మూడోసారి పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని అన్నారు.
అనంతరం ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎంపీగా గెలిచిన రేవంత్రెడ్డి నియోజక వర్గ అభివృద్ధిని విస్మరించారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ముస్తాక్, మాజీ అధ్యక్షుడు రేపాక కుమారస్వామి, సీనియర్ నాయకురాలు భాగ్యరేఖ, జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, తిప్పని సంపత్కుమార్, గడ్డం రవికుమార్, జేసీబి రాజు, మంజుల, గరిక సుధాకర్, బైగల్ల్ల జంగయ్య, రహమాన్, సీమ అశోక్, గుండం మధు, రత్నం, మహేందర్ ముదిరాజ్, డాన్ శ్రీను, జక్రియ, బాలకృష్ణ, నారాయణస్వామి, ప్రశాంత్, అద్వైత్రెడ్డి, పద్మ, సబిత పాల్గొన్నారు.