మాదాపూర్ : మసాజ్ సెంటర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిర్వాహకుడితో పాటు ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన మంగళవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం …
మాదాపూర్ పత్రికానగర్లోని లోటస్ బ్లిస్ స్పా ముసుగులో నిర్వాహకులు వ్యభిచారానికి పాల్పడుతుండగా సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులతో పాటు సైబరాబాద్ ఏహెచ్టియు సిబ్బంది సంయుక్తంగా దాడులు చేశారు.
స్పా సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఉప నిర్వాహకుడు సచిన్ (23) తో పాటు విటులు ఖమ్మం పట్టణానికి చెందిన సతీష్ కుమార్ (48), తెల్లాపూర్కు చెందిన రాజ్ కుమార్ పాటిల్ (32) లను అదుపులోకి తీసుకొని విచారించారు.
దీంతో ప్రధాన నిర్వాహకురాలు దుర్గాసి సుజాత కొన్ని నెలలుగా మసాజ్ సెంటర్ ముసుగులో థెరపిస్టుల పేరుతో పలు ప్రాంతాల నుండి యువతులను రప్పించి వారి చేత వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. వారిని అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు.
నలుగురు బాధిత మహిళలను రెస్క్యూహోంకు తరిలించారు. కాగా సుజాతపై గతంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నట్లు తెలిపారు.