చిక్కడపల్లి, జనవరి13 : ప్రపంచంలోనే భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన 5వ స్థానంలో నిలిచిందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్కుమార్ సింగ్ అన్నారు. శనివారం బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కు సమీపంలో వికసిత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్కుమార్సింగ్ స్టేట్ బ్యాంక్ ఇండియా ద్వారా మంజూరైన పథకాలకు సంబంధించిన మం జూరు పత్రాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకాల ఫలాలు ప్రజలకు చేరవచేసేందుకు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాడానికి వికసిత్ సంకల్ప యాత్రను చేపట్టడం జరిగింద అన్నారు.
ఈ యాత్ర 26 తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ జనరల్ మేనేజర్ దేశిష్మిత్ర, డీజీఎం మోహన్ దాస్, చీఫ్ మేనేజ ర్ వీవీఆర్ రఘురాం, తెలంగాణ స్టేట్ లెవెల్ బ్యాంకర్ కమిటీ ఏజీఎం హరి, జి.లింగస్వా మి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్గౌడ్, స్థానిక కార్పొరేటర్ రవిచారి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.