బాలానగర్, జూలై 21 : వ్యాపార, వాణిజ్య సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ వాణిజ్య సంస్థల ప్రతినిధి సూరజ్కుమార్ తివారీ అన్నారు. బుధవారం కేంద్ర ఎంఎస్ఎంఈ పరిశ్రమల మంత్రి నారాయణ రాణేను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సూరజ్కుమార్ తివారీ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిగా దివాలదిశగా పయనిస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరామన్నారు. భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ ఉండడానికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కోరినట్లు తెలిపారు.