కాచిగూడ,నవంబర్ 21 : పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి(35) ఆదివారం బుద్వేల్-ఉందానగర్ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాల పక్కన నడుచుకుంటూ వెలుతుండగా ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని మృతదేహన్ని స్వాధీనపర్చుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుని ఒంటిపై తెలుపు రంగు ఫూలచొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి, ఎత్తు 5.7 ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు 8143807592లో సంప్రదించాలని కోరారు.