బంజారాహిల్స్, జనవరి 3: కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 15నుంచి 18ఏండ్ల వయస్సు వారికి టీకా కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షౌకత్నగర్, శ్రీరాంనగర్, వినాయక్నగర్, బోరబండ తదితర పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసిన వైద్యశాఖ అధికారులు టీకాలు వేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో సుమారు 20వేలమంది దాకా అర్హులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 250మందికి టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం 7లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో మంత్రి హరీశ్రావు చేతులమీదుగా టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు అక్కడకు వచ్చి వ్యాక్సిన్ల కోసం కొవిన్ యాప్లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయంచుకున్నారు. కొవాగ్జిన్ టీకా వేస్తున్నారని, 28 రోజులు దాటగానే రెండో డోసు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. టీకాలు వేసుకునేలా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లతో పాటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలకు సూచనలు జారీ చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు టీకాలు వేయించేలా అవగాహన కల్పించాలని అధికారులు కోరుతున్నారు. రద్దీని బట్టి కేంద్రాల సంఖ్యను పెంచుతామని అధికారులు తెలిపారు.