షేక్పేట్ : ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. శుక్రవారం రాత్రి షేక్పేట్ డివిజన్ లోని జానకీనగర్,ఈస్ట్ జానకీనగర్లలో సమస్యలపై శంఖారావం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు.
కాలనీలలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షేక్పేట్ డివిజన్లోని కాలనీలలో,బస్తీలలో సమస్యలను పరిష్కరించి అభివృద్ధిని అందిస్తున్నా మని పేర్కొన్నారు. ప్రజలుఎప్పుడు పిలిచినా స్పందిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జలమండలి, విద్యుత్, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖల అధికారులు జవహర్ అలీ, హరిరామ్, సుష్మ,కొణతం చంద్రశేఖర్ రెడ్డి,ఎఈ యూసుఫ్,టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ప్రదీప్ కుమార్,ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్,రఫీయా బేగం,బాలకృష్ణ,మధుసూదన్ కాలనీ అధ్యక్షులు ముస్తాక్ ఖాన్,ప్రధాన కార్యదర్శి మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
జానకీనగర్లో సివరేజి లైన్ నిర్మాణానికి శంఖుస్థాపన….
షేక్పేట్ డివిజన్లో నీటి ,మురుగునీటి పారుదల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు.
శుక్రవారం సాయంత్రం షేక్పేట్ డివిజన్లోని జానకీనగర్లో 30 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న సివరేజి లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ శంఖుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం జవహర్ అలీ,టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు దుర్గం ప్రదీప్కుమార్,షకీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.