మారేడ్పల్లి, జనవరి 3 : సికింద్రాబాద్లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని మల్టీ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన యోనెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా జూనియర్ అండర్ -19 ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ చాంపియన్షిప్ పోటీలు ఎంకేఎస్ ఆకాడమీ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలను ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ ప్రారంభించారు.
ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా బ్యాట్ వైస్ ప్రెసిడెంట్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్మెంబర్ చాముండేశ్వరీనాథ్, మెదక్ జిల్లా చైర్మన్ పీసీఎస్ రావు, ఆర్ఆర్డీ బీఏ వైస్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, మల్కా యశస్వి, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కరెడ్ల శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ ఆర్ఆర్డీబీఏ కే. లక్ష్మణ్, బ్యాట్ జాయింట్ సెక్రటరీ యూవీఎస్ బాబు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కోశాధికారి కె. వంశీధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. వికాస్ హర్ష, బ్యాట్ ఆఫీస్ సెక్రటరీ పీవీఎల్ కుమార్ తదితరులు హజరయ్యారు.