దుండిగల్,మార్చి3: హోలీ వేడుకల్లో అపశుృతి చోటుచేసుకుంది.ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉత్సాహంగా రంగులు చల్లుకుంటూ గడిపిన మిత్రుల్లో విషాదం చోటుచేసుకుంది.రంగుల్లో తడిసి ముైద్దెన అనంతరం చెరువులో స్నానానికి దిగిన ఇద్దరు(బాలురు) విద్యార్థులు ఈత రాకపోవడంతో నీటిమునిగి దుర్మరణం పాలయ్యారు.ఈ ఘటన సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ సుధీర్కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం…గాజులరామారం శ్రీకృష్ణానగర్కు చెందిన అభిషేక్(17), విశ్వకర్మకాలనీకి చెందిన సాగర్కుమార్(17) ఎం.అజయ్,మేకల ఛత్రపతి, సీహెచ్.విఘ్నేష్లు బహదూర్పల్లిలోని ప్రభుత్వజూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.
మంగళవారం హోలీ వేడుకలను మిత్రులందరు సంతోషంగా జరుపుకున్నారు. మద్యాహ్నం వేళ మిత్రులందరూ స్నానం చేసేందుకని విశ్వకర్మకాలనీలోని పంతులు చెరువులోకి దిగి ఈత కొట్టారు. అయితే అభిషేక్,సాగర్కుమార్లకు ఈత రాకపోవడంతో చెరువులోని నీట మునిగిపోయారు.తోటి స్నేహితుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో చెరువులో మునిగిన అభిషేక్,సాగర్కుమార్ మృతదేహాలను వెలికితీశారు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. అనంతరం మృతదేహాలను పోస్ట్మార్టం కోసం గాంధీవైద్యశాలకు తరలించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా బీహార్కు చెందిన సాగర్ కుటుంబం విశ్వకర్మకాలనీలో స్థిరపడగా,మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన అభిషేక్ కుటుంబం శ్రీకృష్ణానగర్లోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నది.