సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మంగళవారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.4 డిగ్రీలు, గాలిలో తేమ 72శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. నగరంలో అక్కడక్కడ జల్లులు కురిశాయి. మోండా మార్కెట్లో 4.0 మి.మీ., కాప్రా-చర్లపల్లి ప్రాంతంలో 3.8మి.మీ., రాజేంద్రనగర్ 3.3 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.