హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్బీనగర్లో రోడ్డుపక్కన ఆగివున్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లాకు చెందిన ధరావవత్ అశోక్ కారు నడుపుతుండగా అతనితో పాటుకారులో సరూర్నగర్కు చెందిన బొర్రా మధు ఉన్నారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్ర లేఅవుట్ సమీపంలో రోడ్డుపక్కన నిలిపివున్న లారీనీ గమనించని అశోక్ నేరుగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. అశోక్, మధు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను కామినేని ఆస్పత్రికి తరలించారు.