సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్లను బదిలీ చేయగా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ శాఖల్లో స్వల్ప మార్పు లు జరిగాయి. హెచ్ఎండీఏ జాయింట్ మెట్రో పాలిటన్ కమిషనర్గా ఉన్న వెంకన్నను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మున్సిపల్ కమిషనర్గా బదిలీ చేశారు.
జీహెచ్ఎంసీ శంషాబాద్ జోనల్ కమిషనర్, అదనపు కమిషనర్ (ఎన్నికల విభాగం) బాధ్యతలు నిర్వహిస్తున్న కే చంద్రకళను హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (కోర్ అర్బన్ రీజియన్, ల్యాండ్ ఫూలింగ్, మెట్రోరైల్) పోస్టులో పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. కాగా సర్ ప్రక్రియలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రకళను ఉన్న ఫలంగా హెచ్ఎండీఏకు బదిలీ చేయడం, ఈ స్థానంలో కొత్త వారిని నియమించకపోవడం పై చర్చనీయాంశంగా మారింది.