హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): హజ్యాత్రలో తెలంగాణకు చెందిన మరో ఇద్దరు యాత్రికులు మృతి చెందారు. నిజామాబాద్ నగరం లోని అహ్మద్పురాకాలనీకి చెందిన సయ్యద్ అబ్దుల్ ఖుద్దూస్, హైదరాబాద్లోని బార్కస్కు చెందిన అహ్మద్ బిన్ అబ్దుల్లా ఇటీవల హజ్యాత్రకు వెళ్లారు.
దీర్ఘకాలిక వ్యాధులతో పడుతున్న వారు యాత్రలో అనారోగ్యానికి గురి కాగా, జెద్దాలోని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మంగళవారం రాత్రి మరణించారు. యాత్రికుల మృతిపై తెలంగాణ హజ్ క మిటీ చైర్మన్ మహ్మద్ సలీం తీవ్ర సం తాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.