హైదరాబాద్: నగర శివార్లలోని హిమాయత్సాగర్ (Himayat sagar) సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున హిమాయత్సాగర్ సర్వీస్ రోడ్డుపై వేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతులను జార్ఖండ్కు చెందిన జితేందర్, కేదారేశ్వర్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో మంచిర్యాల జిల్లాలో జరిగిన ప్రమాదంలో బీజేపీ నేత మరణించారు. జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట వద్ద కారు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు సత్యనారాయణ రావు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.