సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలో స్టూడెంట్ బస్ పాసులను ఈనెల 15నుంచి ఇవ్వనున్నట్లు జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలోని 37 కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. గత ఏడాది మాదిరిగానే ఈసారీ చార్జీలు ఉంటాయన్నారు. విద్యార్థులు ఆన్లైన్లోనే పాసుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం https://online.tsrtcpass.inలో సంప్రదించాలన్నారు.