e-Challan | వాహనదారులకు గుడ్న్యూస్. రాష్ట్రంలో వాహనాల పెండింగ్ చలాన్లు చెల్లింపు గడువును ఫిబ్రవరి 15 వరకు ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో గడువును పెంచుతూ జీవో జారీ చేసింది. ప్రభుత్వం డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సాంకేతిక సమస్యల నేపథ్యంలో మరో 15 రోజుల పాటు గడువును పొడిగించింది.
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ చలాన్లు 3.59 కోట్లు ఉండగా.. దాదాపు 1.50 కోట్ల చలాన్లకుపైగా చెల్లింపులు జరిగాయి. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీతో ప్రభుత్వానికి రూ.135 కోట్లకుపైగానే ఆదాయం సమకూరింది. టూ వీలర్స్, ఆటోల చలాన్లపై 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ-చలాన్ వెబ్సైట్, పేటీఎం ద్వారా చలాన్లు చెల్లించుకునేలా అవకాశమిచ్చారు.