కీసర, మార్చి 20; పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అన్న మాటలను నిజం చేస్తూ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం అధికారాలను కట్టబెట్టింది. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులను స్థానికంగా ఉన్న పంచాయతీ ఆధ్వర్యంలోనే చేపట్టే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిం ది. పంచాయతీ ద్వారా అభివృద్ధి జరుగడానికి ప్రభుత్వం 18జీవోను అమలులోకి తీసుకొచ్చింది. ఈ జీవో ద్వారా గ్రామాల్లో ఎన్ని లక్షల పనులకైనా పంచాయతీలో సభ్యు ల తీర్మానం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. గతంలో గ్రామాల్లో పనులను ప్రారంభించడానికి ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షణలు చేసేవారు. దాంతో గ్రామాల్లో చేపట్టే పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండేది. ప్రభుత్వం గ్రామాల్లో జరుగుతున్న ఇబ్బందులు, పనుల్లో జాప్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొన్న ప్రభు త్వం నేరుగా పంచాయతీల ద్వారానే పనులు చేసుకోవడానికి అధికారాలను ఇవ్వాలన్న సంకల్పానికి శ్రీకారం చుట్టింది. పాత విధానానికి స్వస్తి పలుకుతూ స్థానిక సంస్థలకు న్యాయం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామాలకు అత్యధిక నిధులను ఖ ర్చు చేసుకొనే వెసలు బాటు కల్పించడంతో సర్పంచుల నుంచి ఒక్కసారిగా హర్షం వ్యక్తం అవుతున్నది. గతంలో గ్రామాల్లో కేవలం రూ.2లక్షల రూపాయల వరకే తీర్మా నం చేసి పనులు చేసుకునేవారు. రూ. 3లక్షలైతే డీఎల్పీఓ, రూ.10లక్షల వరకు అయితే కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సిందే. పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చి న తరువాత రూ.20లక్షల నుంచి ఇంకా ఎన్ని లక్షలైన పంచాయతీ సభ్యుల సమక్షంలో తీర్మానం చేసుకొని పనులను ప్రారంభించే వెసులుబాటును కల్పించడంతో ఆయా గ్రామాల సర్పంచ్ల నుంచి ఒక్కసారిగా హర్షం వ్యక్తం అవుతున్నది.
పంచాయతీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 18వ జీవోను అమలు చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో గ్రామాల్లో ఏ పని చేయాలన్నా మండల అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రభుత్వం జారీ చేసిన జీవోతో ఎన్ని పనులైనా చేసుకోవడానికి అధికారం రావడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. – నాయకపు మాధురి, కీసర సర్పంచ్
పంచాయతీరాజ్ జీవో 18తో గ్రామాలు అభివృద్ధిలో మరింతగా ముందుకెళ్తాయి. స్థానికంగా ఉన్న పంచాయతి సర్వసభ్య సమావేశంలో ఏపనికి ఎన్ని నిధులు ఖర్చుచేయాలన్న అధికారం పంచాయతి పాలకవర్గానికి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.
– మహేందర్రెడ్డి, సర్పంచ్ గోధుమకుంట