ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 8 : కేంద్రం దిగివచ్చి వడ్లు కొనేవరకు ఉద్యమం ఆగదని టీఆర్ఎస్వీ నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర రైతాంగం యాసంగిలో పండించిన వరిధాన్యాన్ని కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయనందుకు నిరసనగా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శుక్రవారం నల్లబెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిస్తున్న రాష్ర్టాలకు ఒక న్యాయం, ఇతర పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాలకు మరో న్యాయం అమలు చేస్తున్నదని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలను నూకలు తినాలని కేంద్రమంత్రి స్వయంగా అవమానించినా.. తెలంగాణ బీజేపీ నాయకులు ఖండించకుండా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం దిగిరానిపక్షంలో మరో మహా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు పల్లా ప్రవీణ్రెడ్డి, డాక్టర్ వల్లమల కృష్ణ, డాక్టర్ మంద సురేశ్, టీఆర్ఎస్వీ నాయకులు గదరాజు చందు, టైగర్ రఘురాం, కొంపెల్లి నరేశ్, జిల్లా నాగయ్య, జంగయ్య, బొల్లు నాగరాజు, నాగారం ప్రశాంత్, బాలు, సంతోశ్, కాటం శివ, జలంధర్, కృష్ణ, గంగాధర్, రాము, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.