వనస్థలిపురం, ఏప్రిల్ 24: దేశ దిశను మార్చే విధంగా టీఆర్ఎస్ ప్రయాణం ఉంటుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వనస్థలిపురంలో ఆదివారం జెండా పండుగను నిర్వహించారు. పలు చోట్ల ఎమ్మెల్యే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వం జాతీయ స్థాయిలో ప్రభావితం చేయనుందన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దిక్సూచిలా నిలిచిందన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు, ప్రజలు పండుగలా జరపుకోవాలని పిలుపునిచ్చారు. మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ గుప్తా, లగ్గోని శ్రీధర్గౌడ్, గాండ్ల లత, వేములయ్యగౌడ్, సంజయ్కుమార్, మధుగౌడ్, ఆనంద్రాజు, గడల రాజు, పద్మ, నవీద్ తదితరులు పాల్గొన్నారు.
దేశానికే ఆదర్శం..
హయత్నగర్, ఏప్రిల్ 24: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కొనియాడారు. ఈనెల 27న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ముందస్తుగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హయత్నగర్లో మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ జెండా పండుగ వేడుకలకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జెండావిష్కరణ చేశారు. హయత్నగర్లోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా, వర్డ్ అండ్ డీడ్ ఎదురుగా, హైవే బావర్చి ఎదురుగా, రంగనాయకుల గుట్ట, బంజారాకాలనీలో టీఆర్ఎస్ జెండావిష్కరణ కార్యక్రమాలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ మాజీ అధ్యక్షుడు గుడాల మల్లేశ్ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి యానాల కృష్ణారెడ్డి, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ముత్యాల రాజశేఖర్రావు, భాస్కర్ సాగర్, నక్క రవీందర్ గౌడ్, కాటెపాక స్కైలాబ్, పారంద రమేశ్, డ్యాగల రాకేశ్ కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు అంజలి గౌడ్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు మహ్మద్ రఫీక్, బీసీ సెల్ అధ్యక్షుడు బాలకృష్ణ, సోషల్ మీడియాసెల్ అధ్యక్షుడు హరికృష్ణ, ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షుడు దేవరాంనాయక్, కార్మిక విభాగం అధ్యక్షుడు నాగరాజు, నాయకులు దేవ ప్రసన్న, వెంకటేశ్, గణేశ్, మనోజ్, భాస్కర్ గుప్తా, సుమన్ గౌడ్, మధు, పంతునాయక్, గోవర్ధన్ నాయక్, నాగేశ్, భాస్కర్, శంకర్, ఖాదర్, యూసుఫ్, రవి, శేఖర్, స్వామి, శ్రీరాములు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
దేశానికే మార్గదర్శకంగా..
మన్సూరాబాద్, ఏప్రిల్ 24: ఈనెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకుని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం చైతన్యపురి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తోట మహేశ్ యాదవ్ ఆధ్వర్యంలో వికాస్నగర్ కాలనీలో టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ ముఖ్య అతిథిగా హాజరై టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం మాజీ చైర్మన్ కోతి నర్సిరెడ్డి, నాయకులు ఏమిరెడ్డి భూపేష్రెడ్డి, బొగ్గారపు శరత్చంద్ర, చిన్నయాదవ్, నజీర్, పాశం శ్రీకాంత్, ప్రవీణ్చారి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
జెండా పండుగను ఘనంగా నిర్వహించాలి
– జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి
మహేశ్వరం, ఏప్రిల్ 24: జెండా పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించాలని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి అన్నారు. ఈనెల 27న జరిగే ప్లీనరీని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని అన్నారు.
స్థల పరిశీలన..
కందుకూరు, ఏప్రిల్ 24: జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, సీనియర్ నాయకులు సురుసాని సురేందర్రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి ఈనెల 27న పార్టీ జెండాలను ఆవిష్కరించే స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు సామ మహేందర్రెడ్డి, డైరెక్టర్లు పొట్టి ఆనంద్, సామ ప్రకాశ్రెడ్డి, సురుసాని శేఖర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, మాజీ అధ్యక్షుడు మూల హన్మంత్రెడ్డి, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తిక్, అధ్యక్షుడు కొలను విఘ్ఞేశ్వర్రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షుడు బొక్క దీక్షిత్రెడ్డి, బర్కం వెంకటేశ్, అలీ, రాజు, దేశం కృష్ణారెడ్డి పాల్గొన్నారు.