హైదరాబాద్ : ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరాన్ని పార్టీ తోరణాలు, జెండాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో గల తన కార్యాలయంలో పార్టీ జెండాలు, తోరణాలు ఇతర సామగ్రిని పార్టీ నాయకులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తయిందని చెప్పారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని బస్తీలు, డివిజన్ లలో పండుగ వాతావరణం లో వేడుకలను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, సామ ప్రభాకర్ రెడ్డి, కృష్ణా గౌడ్, బాబురావు, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.