ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పిలుపు
మల్కాజిగిరి, ఏప్రిల్ 19: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మై నంపల్లి హన్మంతరావు పిలుపు నిచ్చారు. ఈ నెల 27న జరిగే పార్టీ ఆవి ర్భావ దినోత్సవ సభ ఏర్పాట్ల సన్నహక సమావేశం మంగళవారం కుత్బుల్లాపూర్లోని మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయడానికి ఆమరణ నిరాహార దీక్ష చేశారని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదల అభివృద్ధి కోసం నిరం తరం శ్రమిస్తున్నానే ఉన్నారని అన్నారు.
టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ప్రజలు పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారని అన్నా రు. మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల పరిధిలో పార్టీ పటిష్టంగా ఉందని అన్నారు. క్రియాశీలక నాయకులతో పాటు కార్పొరేటర్లు సమన్వ యంతో పనిచేస్తున్నారని అన్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి నియోజకవర్గస్థాయిలో సన్నహక సమా వేశం బుధవారం మల్కాజిగిరి సర్కిల్, ఆనంద్బాగ్లోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని అన్నారు.