బంజారాహిల్స్,సెప్టెంబర్ 6 : పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం అమలుచేస్తోందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కులను మేయర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. గతంలో ఆడపిల్ల పెండ్లి అంటే పేదలు ఎంతో భారంగా భావించేవారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలవల్ల ఎంతో ప్రయోజనం కలుగుతోందన్నారు.
సీఎం కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా అది పేదల కోసమే ఉంటుందన్నారు. ఆసరా, కేసీఆర్ కిట్స్ తదితర పథకాలతో పేదలకు ఎంతో ఉపయోగంగా ఉందన్నారు.