బడంగ్పేట, డిసెంబర్ 29: టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. నాదర్గుల్ 9వ డివిజన్లో డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ నిమ్మల సునిత శ్రీకాంత్గౌడ్, తోట శ్రీధర్రెడ్డి, ఇంద్రసేనతో కలిసి డ్రైనేజీ పనులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని అన్నారు. రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించిన్నట్లు తెలిపారు. ఏఈఈ రాంప్రసాద్, కోఆప్షన్ సభ్యుడు మర్రి జగన్ మోహన్రెడ్డి కాలనీ వాసులు ఉన్నారు.