మేడ్చల్,అక్టోబర్ 27: బీజేపీ తీరుపై టీఆర్ఎస్(బీఆర్ఎస్) శ్రేణులు భగ్గుమన్నాయి.టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి, కొనుగోలు చేయాలనే బీజేపీ దుష్ట పన్నాగాన్ని నిరసిస్తూ గురువారం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో టీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి, తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారధ్యంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అనూహ్యంగా అభివృద్ధి చెందుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ర్టాన్ని దేశంలో నెంబరు వన్ స్థానంలో కేసీఆర్ నిలిపారన్నారు.కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రాజు, మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, నాయకులు మర్రి నర్సింహ రెడ్డి, రాజమల్లారెడ్డి, పీఏఏసీ చైర్మన్ రణదీప్ రెడ్డి, సర్పంచ్ బాబుయాదవ్, నాయకులు బత్తుల మధుకర్ యాదవ్, కౌడె మహేశ్, రవీందర్ రెడ్డి,సందీప్ గౌడ్, దుర్గం వెంకటేశ్, రాజశేఖర్రెడ్డి, రవీందర్ గౌడ్, రఘుపతిరెడ్డిపాల్గొన్నారు.
పీర్జాదిగూడ:ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూడటం సిగ్గుచేటని ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వెంకట్రెడ్డి అన్నారు. మేయర్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కార్పొరేటర్లు,నాయకులతోర్యాలీనిర్వహించి,ఉప్పల్ ఆర్టీసీ డిపో వద్ద బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమం లో డిప్యూటీమేయర్, కార్పొరేటర్లు నాయకులు ఉన్నారు.
ఘట్కేసర్: ప్రజాసంగ్రామంలో గెలవలేని బీజేపీ నీతిమాలిన చర్యకు పాల్పడిందని ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల చైర్పర్సన్లు పావని జంగయ్య యాదవ్, కొండల్రెడ్డి అన్నారు. పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీలలో టీఆర్ఎస్ శ్రేణులు మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోచారం టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.
బోడుప్పల్ : అప్రజాస్వామికంగా వ్యవహరించిన బీజేపీ మునుగోడు ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి అన్నారు. బోడుప్పల్లో మోదీ దిష్టిబొమ్మను దహనంచేశారు. కార్పొరేటర్లు కొత్త చందర్గౌడ్, చీరాల నర్సింహ, సుమన్నాయక్, నాయకులు కృష్ణ, రవిగౌడ్,రాంచంద్రారెడ్డి, జంగారెడ్డి, యాదగిరి,శ్రీధర్గౌడ్, కార్యకర్తలు ఉన్నారు
జవహర్నగర్: బీజేపీ నోటు రాజకీయాలను సహించమని జవహర్నగర్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బీజేపీ తీరుకు నిరసనగా నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను కార్పొరేషన్లోని అంబేద్కర్ చౌరస్తాలో కార్పొరేషన్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో దహనం చేశారు. కార్పొరేటర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.