అంబర్పేట, జూలై 28 : నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో శుక్రవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ పర్యటించారు. నల్లకుంట డివిజన్ పరిధిలోని రత్నానగర్ వద్ద హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలాకు ఇరువైపులా చేపట్టనున్న రిటైనింగ్ వాల్ నిర్మాణం, పటేల్నగర్లో ఎస్ఎన్డీపీ కింద చేపట్టిన నాలా నిర్మాణ పనులను పరిశీలించారు. ముందుగా రత్నానగర్ వద్ద నిర్మించనున్న రిటైనింగ్ వాల్ పనుల విషయాన్ని ఎమ్మెల్యే కమిషనర్కు వివరించారు. వాల్ నిర్మాణంతో కొన్ని ఇండ్లు పూర్తిగా, మరికొన్ని ఇండ్లు పాక్షికంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. అనంతరం రత్నానగర్ బస్తీవాసులతో మాట్లాడారు. తమకు ఇబ్బంది కలగకుండా రిటైనింగ్ వాల్ నిర్మించాలని బస్తీవాసులు ఎమ్మెల్యే, కమిషనర్కు విన్నవించారు. నష్టం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
అనంతరం పటేల్నగర్లో ఎస్ఎన్డీపీ కింద నిర్మిస్తున్న నాలా నిర్మాణ పనుల పురోగతిపై కమిషనర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్, ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ జియావుద్దీన్, ఎస్ఎన్డీపీ సీఈ కిశోర్, జోనల్ కమిషనర్ రవికిరణ్, డీసీ మారుతీదివాకర్, సీసీపీ రాజేంద్రప్రసాద్నాయక్, ఏఎంఓహెచ్ జ్యోతిబాయి, టౌన్ప్లానింగ్ ఏసీపీ వీరస్వామి, బీఆర్ఎస్ నల్లకుంట, అంబర్పేట డివిజన్ అధ్యక్షులు మేడిప్రసాద్, సిద్ధార్థ్ ముదిరాజ్, నాయకులు శ్రీరాములుముదిరాజ్, పి.గెల్వయ్య, మధుసూధన్రెడ్డి, భాస్కర్గౌడ్, నరేందర్, రాముయాదవ్, శంకర్, రఘురాంరెడ్డి, వీరయ్యగౌడ్, రాజేశ్, రాజు, సతీశ్చంద్ర, చంద్రకాంత్, ధన్రాజ్, సుజిత్, నవీన్, శ్రీధర్, రామారావుయాదవ్, ప్రవీణ్, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.
నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ వై.అమృత శుక్రవారం వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ, వాటర్వర్క్స్ అధికారులతో కలిసి బస్తీల్లో పొంగిన మ్యాన్హోళ్లను చూపించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. తిలక్నగర్ గాంధీ బొమ్మ, హ్యాపీహోమ్స్ అపార్ట్మెంట్, తిలక్నగర్ మెయిన్రోడ్డు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో చేరిన వరదను డీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించి తొలగింపజేశారు. కార్యక్రమంలో వాటర్వర్క్స్ మేనేజర్ రోహిత్, జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ నరేందర్, బీజేపీ నాయకులు రమణానాయుడు, శ్రావణ్, లక్ష్మణ్, కిశోర్కుమార్, బాబు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
గోల్నాక : అంబర్పేట డివిజన్ ప్రేమ్నగర్, బాపునగర్, సీబ్లాక్ తదితర లోతట్టు ప్రాంతాల్లో శుక్రవారం కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్ గౌడ్ పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజాసమస్యలు తెలుసుకుని అక్కడక్కడా కూలిన చెట్లను తొలగింపజేయడంతో పాటు వరద నీరు సజావుగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు.