శంషాబాద్ రూరల్, డిసెంబర్ 4: దివ్యాంగులను ప్రోత్సహించడం కోసమే 5కే, 10కే రన్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని కవ్వగూడ గ్రామంలో 18 ఎకరాల అటవీ ప్రాంతాన్ని గుర్తించి ట్రయల్ ఫెస్ట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ డిసెంబర్ 3న దివ్యాంగుల దినోత్సవం, 4న అంతర్జాతీయ సాయిల్ డే సందర్భంగా ఈ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిజైనర్ శిల్పారెడ్డి, సినీనటి రెజీనా, స్టోన్ క్రాస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ కీర్తి చిలుకూరి, తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుడితో జయేశ్రంజన్, తదితరులు