Hyderabad | రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో హైదరాబాద్లో ఆదివారం ట్రాఫిక్ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర వేడుకలు, రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమాల దృష్ట్యా ఆంక్షలు విధించారు.
జనవరి 26వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి ఉదయం11.30 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలైన టివోలీ ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్డు మార్గాలను మూసివేయనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రయాణికులు షెడ్యూల్ కంటే ముందే బయల్దేరి రైల్వే స్టేషన్కు చేరుకోవాలని సూచించారు.