హైదరాబాద్: రంజాన్ (Ramadan) మాసం చివరి శుక్రవారం కావడంతో హైదరాబాద్లోని చార్మినార్ (Charminar ) మక్కా మసీదు (Makkah Masjid) వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్లోని (Secunderabad) జామ్-ఎ-మసీదులో కూడా ప్రార్థనలు కొనసాగుతున్నాయి. ప్రార్థనల్లో పెద్దసంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రత్యేక ప్రార్థనల దృష్ట్యా పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
చార్మినార్-మదీనా, చార్మినార్-ముర్గి చౌక్, చార్మినార్-రాజేశ్ మెడికల్ హాల్, శాలిబండ మధ్య వాహనాల రాకపోకలను నిషేధించారు. నయాపూల్ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను మదీనా జంక్షన్ నుంచి సిటీ కాలేజీ వైపునకు మళ్లిస్తున్నారు. శాలిబండ నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను హిమ్మత్పురా జంక్షన్ వద్ద హరిబౌలి, వోల్గా హోటల్ టీ జంక్షన్ మీదుగా వాహనాలను దారిమళ్లిస్తున్నారు. కోట్ల అలిజా నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను చౌక్ మైదాన్ ఖాన్ వద్ద హాఫీజ్ డంకా మసీదు, అమన్ హోటల్ వైపు, మూసాబౌలి నుంచి చార్మినార్ వచ్చే వాహనాలను మోతిగల్లి వద్ద ఖిల్వాత్ గ్రౌండ్, రాజేశ్ మెడికల్ హాల్, ఫతే మైదాన్ రోడ్డు మీదుగా మళ్లిస్తున్నారు.