హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన నేపథ్యంలో శనివారం హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విద్యానగర్లోని అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్ను వెంకయ్యనాయుడు రేపు సందర్శించనున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి విద్యానగర్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఉదయం 8:30 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు అరబిందో స్కూల్లో నిర్వహించే కార్యక్రమాల్లో వెంకయ్య నాయుడు పాల్గొననున్నారు.
జూబ్లీహిల్స్ చెక్పోస్టు, ఎన్ఎఫ్సీఎల్, తాజ్ కృష్ణ, అన్సారీ మంజీల్, ఆర్టీవో ఆఫీసు, వీవీ స్టాచ్యూ, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ ఘాట్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, అంబేద్కర్ స్టాచ్యూ, లిబర్టీ, హిమాయత్నగర్, నారాయణగూడ ఫ్లై ఓవర్, క్రౌన్ కేఫ్, టీవై మండలి, ఫీవర్ హాస్పిటల్, హిందీ మహావిద్యాలయ, విద్యానగర్ జంక్షన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ మార్గాల గుండా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని నగర ట్రాఫిక్ పోలీసులు సూచించారు.