హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్లో ఆ రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో గురువారం రోజు రోడ్ నంబర్ 12 మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
-ఎన్టీఆర్ భవన్ నుంచి అపోలో హాస్పిటల్, ఫిలిం నగర్, బంజారాహిల్స్ మీదుగా మాదాపూర్, సైబరాబాద్ వైపు వెళ్లే వాహనదారులు.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నంబర్ 36, రోడ్ నంబర్ 45 మీదుగా వెళ్లాలని సూచించారు.
-మాసాబ్ ట్యాంక్ నుంచి రోడ్ నంబర్ 12 వైపు వెళ్లే వాహనదారులు.. రోడ్ నంబర్ 1, రోడ్ నంబర్ 10, జహీరా నగర్, క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా ప్రయాణించొచ్చు.
-ఫిలిం నగర్ నుంచి ఒరిస్సా ఐలాండ్ వైపు వచ్చే వాహనదారులు.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్ఎన్టీ, ఎన్ఎఫ్సీఎల్ నుంచి పంజాగుట్ట మీదుగా వెళ్లొచ్చు.