హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ జులై 2, 3వ తేదీల్లో హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 2వ తేదీన జరిగే మాదాపూర్ హెచ్ఐఐసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి మోదీ హాజరు కానున్నారు.
ఈ నేపథ్యంలో ఆ ఏరియాలో ఉండే కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేసుకోవాలని పోలీసులు సూచించారు. కావూరి హిల్స్ – కొత్తగూడ వరకు ఉన్న కంపెనీలపై పోలీసులు ఆంక్షలు విధించారు. హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ నుంచి ఐకియా రోటరీ వరకు ఉన్న కంపెనీలపై కూడా ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మార్గాల్లో వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చూసుకోవాలని సూచించారు. ఇక 3న సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలోనూ మోదీ ప్రసంగించనున్నారు.