హైదరాబాద్: ఇంకొద్ది గంటల్లో 2022 సంవత్సరానికి వెల్కమ్ చెప్పబోతున్నాం. ఈసందర్భంగా అందరూ 2021 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు చెబుతున్నారు. ఈనేపథ్యంలో చాలామంది మద్యం సేవించి వాహనాలు నడిపే అవకాశం ఉండటంతో.. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
సైబరాబాద్ పరిధిలో ఉన్న ఫ్లైఓవర్స్ను పోలీసులు ఈరోజు రాత్రి మూసివేయనున్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ఓఆర్ఆర్పై కార్లకు అనుమతిని నిరాకరించారు. సైబరాబాద్ పరిధిలో 200 చోట్ల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను రాత్రి మొత్తం నిర్వహిస్తామని.. ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపినా.. ప్రమాదరకంగా వాహనాలు నడిపినా.. శబ్ద కాలుష్యం చేసినా జరిమానా విధించడంతో పాటు వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ స్పష్టం చేశారు.