హైదరాబాద్ : ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, నానాక్రామ్గూడలోని ఎక్సాటిక్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో హనీవెల్ నుంచి సత్తా వరకు టెలీస్కోపిక్తో కూడిన హైడ్రాలిక్ క్రేన్లతో భారీఎత్తున్న సామాగ్రిని ఎత్తివేసే పనులు చేస్తుండడంతో గతంలో 7 రోజుల పాటు (23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు) రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
ఈ ఆంక్షలను 30వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాపిక్ డీసీపీ తెలిపారు. ఈ సందర్భంగా వెస్ట్బిల్డింగ్ నుంచి హయత్ హైదరాబాద్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను వేవ్ రాక్ జంక్షన్ వద్ద నుంచి మళ్లిస్తారు. రోడ్డు మధ్యలో కోన్స్ ఏర్పాటు చేసి రోడ్డుకు ఇరువైపు ట్రాఫిక్ మార్షల్స్, రిఫ్లెక్టర్లతో 50 మీటర్లకు ఒకరిని ఏర్పాటు చేస్తారు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ జంక్షన్ నుంచి వెస్ట్బిల్డింగ్ సర్వీస్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలను హయత్ హైదరాబాద్ జంక్షన్ వద్ద కోన్స్ రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసి ట్రాఫిక్ను మళ్లిస్తారు.