గోల్నాక, ఆగస్టు 19 : అంబర్పేట ప్రధాన రహదారిలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్కుమార్ తెలిపారు.
గోల్నాక షాలెం చర్చి నుంచి అంబర్పేట ముఖుర్రం హోటల్ వరకు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తి అయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ దారుల్లో ప్రయాణించాలని ఆయన సూచించారు.