హైదరాబాద్ : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ స్టేడియం పరిసరాల్లో 17వ తేదీ మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్టేడియంకు వచ్చే చుట్టూ పక్కల మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.