Durgam Cheruvu | హైదరాబాద్ : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా, ప్రమాదాలను నిలువరించేందుకు సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేయరాదని పోలీసులు హెచ్చరించారు. పార్కింగ్ చేసిన వాహనాలకు భారీ జరిమానా విధిస్తామని తేల్చిచెప్పారు. క్యారేజ్వే వద్ద వాహనాలను పార్క్ చేయడం వల్ల ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. అక్రమంగా వాహనాలను పార్కింగ్ చేస్తే భారీ జరిమానా విధిస్తామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.
అయితే కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేసి, ఇతరులకు ఇబ్బంది కలిగించినట్లు ప్రజల దృష్టికి వస్తే నేరుగా తమకు ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు సూచించారు. 9490617346 అనే నెంబర్కు వాట్సాప్ చేయొచ్చని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
Traffic movement on the Cable bridge is smooth.
We request commuters not to park vehicles on carriageway which obstructs traffic flow.
If any are found parking illegally on the bridge will attract a hefty penalty.
Public can also report these issues through WhatsApp 9490617346. pic.twitter.com/UZiy5MjMQd— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) August 8, 2023